PDPL: కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ జిల్లాలో ఎలిగేడు మండలం నర్సాపూర్, మంథనిలోని గంగాపురిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. లోడింగ్, అన్లోడింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. గన్ని సంచులు, తార్ పాలిండ్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.