WNP: రైతు భరోసాపై రైతులు ఆశలు వదులుకున్నారని, మూడు సీజన్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం వనపర్తిలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం రైతులను వంచిస్తోందని, ప్రశ్నించే వారిని అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.