MHBD: దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామ సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ కార్యక్రమానికి అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల సౌకర్యార్థం శిబిరాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయ విషయమన్నారు. తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ బట్టునాయక్ తదితరులున్నారు.