JN:చిప్పరాళ్లబండ తండాకు చెందిన నానునాయక్ తన భార్య దస్లీ మరణాన్ని తట్టుకోలేక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. ఆమె ఏడాదిన్నర క్రితం కన్నుమూసిన తర్వాత, ఆమె జ్ఞాపకమై నిలవాలని తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి ముసుగేసి ఉంచాడు. బతుకులోనూ, మరణంలోనూ ఆమెకు తోడుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.