TPT: గూడూరులో గురువారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో దేశాయిశెట్టి వీణ జెస్సీ, వంశీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో గురువారం గొడవ జరిగింది. ఈక్రమంలో ఆమె మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి నిర్మల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.