NRML: జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి. ముఖ్యంగా మక్కజొన్న పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి త్వరితగతిన నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను శుక్రవారం ప్రకటనలో ఆదేశించారు.