SRD: ఉపాధ్యాయుల జీపీఎఫ్ బిల్లుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్నకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆమె.. ప్రస్తుతం ముగ్గురు అధికారులతో ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు 60 బిల్లులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.