WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ఈ వారం మొదటిరోజుతో పోలిస్తే ఈరోజు పత్తి ధర కాస్త పెరిగింది. ఈ వారం మొదటిరోజు క్వింటా పత్తి ధర రూ. 7545 ధర పలకగా.. మంగళవారం రూ. 7,510 అయింది. బుధవారం రూ. 7,515 ధర రాగా..గురువారం రూ. 7,550 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ. 7,555 అయిందని అధికారులు తెలిపారు.