MBNR: దేవరకద్ర పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన ఉస్కిల లక్ష్మమ్మ కుమారుడు వంశీ మెడిసిన్లో సీటు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ సందర్భంగా అతని ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటుగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి చదివడం సంతోషమన్నారు.