కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి బుధవారం సాయంత్రం రామారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల ఫైళ్లను పరిశీలించారు. విచారణను వేగవంతం చేయాలని SI రాజశేఖర్ను ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.