WNP: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లాలో 100 రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని క్షయ నిర్ధారణ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో DMHO సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.