MLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాలిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాకు మల్లంపల్లి రైతులు తరలి వెళ్లారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సర్పంచ్ ల్యాడ శ్యామ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.