PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికాబద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో ఇవాళ ఆయన సీపీ అంబర్ కిషోర్ జాతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. స్నానాల కోసం ఘాట్, రోడ్లు, లైటింగ్, ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.