నల్గొండ జిల్లా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. సోమవారం మహా పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించిపోయింది.