జనగామ మండలం ఎల్లంల గ్రామంలో నిర్వహించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కమిటీ సభ్యులు నేడు ఆహ్వానించారు. ఈ నెల 23న ఉదయం 9:30 గంటలకు గ్రామంలో విగ్రహావిష్కరణ మహోత్సవం జరగనుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.