BDK: అశ్వాపురం మండలం ఆనందాపురంలో బుధవారం గ్రామపంచాయతీ సర్పంచ్ ముర్రం సమ్మయ్య ట్రాక్టర్ మీద తిరుగుతూ తానే స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తి చెత్తను సేకరించారు. గ్రామపంచాయతీలో పంచాయతీ మల్టీపర్పస్ కార్మికులకు జీతాలు రాకపోవడంతో గత కొన్ని నెలలుగా చెత్తను సేకరించడానికి కార్మికులు విధులకు రాకపోవడంతో ఆయనే పనులు చేపట్టారు.