శ్రీలంక క్రికెట్ దిగ్గజం, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి క్షేమ సంగక్కర కన్నుమూశారు. క్షేమ మృతి పట్ల లసిత్ మలింగ సహా పలువురు మాజీ క్రికెటర్లు, లీగల్ కమ్యూనిటీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ప్రముఖ న్యాయవాదిగా క్యాండీలో గొప్ప పేరు కలిగిన క్షేమ అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.