TG: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం సరికొత్త బీమా పథకాన్ని ప్రకటించింది. రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే, ఆ అప్పును కుటుంబం లేదా సంఘం సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.10 లక్షల వరకు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. మంత్రి సీతక్క ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో పాటు మహిళలకు రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా అందనుంది.