TG: రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయి పేర్లను ఫైనలైజ్ చేయనున్నారు. ఇప్పటికే ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించగా, రెండో స్థానం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. సామాజిక సమీకరణల ఆధారంగా సాయంత్రానికి రెండో అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.