TG: రాష్ట్రంలో భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును మాదిగలకు కేటాయించాలని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ మాదిగలకు అన్యాయం జరిగిందని, CWCలోనూ ప్రాతినిధ్యం లేదని విమర్శించారు. పార్లమెంట్లో మాదిగలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.