AP: అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎందుకు ఉండరని అధికారులను ప్రశ్నించారు. ఇదే విషయంలో సభలో ఛైర్మన్ కూడా ప్రస్తావించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులందరికీ సీఎస్ ఆదేశాలు పంపారని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాలు, బిల్లుల సమయంలో అధికారులు అందుబాటులో ఉండాలన్న ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.