KMM: మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత బుధవారం 10వ వార్డులోని ట్యాంక్ బండ్ను సందర్శించారు. పిల్లల ఆట పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ శుభ్రత, టాయిలెట్లకు నీటి సౌకర్యం వంటి పనులను పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ రేవతిని ఆదేశించారు. సుందరీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.