AP: మండలి ఛైర్మన్ మోషేన్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అని అన్నారు. అలాగే క్రిస్టియన్ కాదని ఒప్పుకుంటే క్షమాపణలు చెబుతానన్నారు. అయితే, మోషేన్ రాజు తాను హిందువునేనన్నారు. దీంతో ‘నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న. భేషజాలాలకు పోను.. మీరు క్రిస్టియన్ అనుకున్నా. కాదని మీరు చెప్పారు.. వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. తప్పు ఒప్పుకుంటున్నా’ అని అచ్చెన్న పేర్కొన్నారు.