నాగర్కర్నూల్ జిల్లాలో వేపచెట్లను కీటకాలు, శిలీంద్రాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆకులు రంగుమారి రాలిపోతూ, కొమ్మలు ఎండిపోతున్నాయి. పూత, కాయలు రావడం నిలిచిపోయి, చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. నిపుణులు ప్రతికూల వాతావరణ కారణంగా తెగులు వ్యాప్తి చెందుతున్నాయని, వాటిని కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.