NDL: పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఎంఈవో పీ. సుభాన్ అన్నారు. బుధవారం పగిడ్యాలలోని కస్తూర్బా బాలికల పాఠశాలను ఆయన తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశమయ్యారు. పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పిస్తూ ఈనెల 16న పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.