NRML: గ్రామాల్లో శాంతి భద్రతలను అందించేందుకే ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏఎస్పి సాయికిరణ్ తెలిపారు. మంజులాపూర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా 56 బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు.