SRD : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో గల శ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్ను ఘనంగా సన్మానించారు.