VKB: మర్పల్లి మండలంలోని చెరువులు పూడిక నిండి మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో చెరువులు నిండి ఆయకట్టు రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖల్కోడ, ఘనపూర్, రావులపల్లి గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.