WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు TPCC చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు సంబంధిత జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.