KMR: జుక్కల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి పూజలో పాల్గొన్న ఆయన, శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.