NZB: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆలూర్ మండల కేంద్రంలో ఇవాళ కానిస్టేబుల్ గణేష్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జక్రాన్పల్లికి చెందిన కానిస్టేబుల్ గణేష్ గతంలో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. ఈ సందర్భంగా ACP వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్ గణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.