SKLM: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించి, నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు.