KNR: జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు జరిగిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. చొప్పదండిలో బుధవారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించడంతో సబ్బులు, పేస్టులకు, ట్రాక్టర్, వరి కోత మిషన్ తదితర ధరలు తగ్గాయని అన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ, చేపూరి పాల్గొన్నారు.