W.G: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఇవాళ జిల్లా తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారు అన్నారు.