సంగారెడ్డి జిల్లా పంటలు అమ్మేటప్పుడు రైతులు దళారులను నమ్మి, మోసపోవద్దని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం జోగిపేట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.