HNK: పరకాల మండలం మల్లక్కపేటగ్రామ శివారులో మిర్చి చోరీ ఘటన కలకలం రేపింది. రైతు దొమ్మటి బాబు బావి వద్ద అరబెట్టిన సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని దొంగలు అపహరించారు. చోరీకి గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.