KMM: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం పేద కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న ‘రంజాన్ తోఫా’ను కారేపల్లి జామే మస్జీద్ వద్ద పంపిణీ చేశారు. వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.