NZB: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని మోపాల్ మండలం సిర్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రకృతిలో దొరికే సహజ ఆకులతో పక్షుల బొమ్మలు తయారు చేసి ప్రదర్శించారు. HM రాము మాట్లాడుతూ.. నో బ్యాగ్ డేతో విద్యార్థుల్లో కళా ప్రదర్శన విజ్ఞానం సృజనాత్మకత పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు.