MDCL: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. గత మూడు వారాల్లోనే 20 వేలకుపైగా కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.