JGL: ఇబ్రహీంపట్నం వర్షకొండ గ్రామంలోని కొన్ని రోజులుగా విద్యుత్ కోత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట చివరి దశలో ఉన్నందున పంటకు నీరు అవసరమని గ్రామస్థులు తెలిపారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని రైతులు కోరారు. విద్యుత్ కోత ఇలాగే కొనసాగితే సబ్ స్టేషన్ ను ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.