JGL: ధర్మపురి పట్టణానికి చెందిన వేముల రాజేష్కు చెందిన 2 బొలెరో వాహనాల అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టడంతో పాటు టైర్లలో గాలి తీసివేసినట్లు తెలిసింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై జి. మహేష్ తెలిపారు.