NLG: ఫిబ్రవరి 21న ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ సుందరయ్య భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో అధ్యయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1848లో ఇదే రోజున వెలువడిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ స్మరణార్థం ఈ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సామాజిక మార్పు, సమానత్వం కోసం రాసిన అభ్యుదయ సాహిత్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.