MNCL: కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీలో గురు, ఆదివారాల్లో నిర్వహించే సంతలకు నేడు (శనివారం)వేలం వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి కవిత తెలిపారు. ఉదయం 10:30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేలం వేయనున్నట్లు పేర్కొ న్నారు. వేలంలో పాల్గొనేవారు రూ.5 వేలు డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు.