NGKL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని వటవర్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, మినీ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా, లక్ష్మయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.