PDPL: ముత్తారంమండలం మచ్చుపేట గ్రామ పరిధిలోని 9L కాలువలో పేరుకుపోయిన పూడికతీత పనులు చేపట్టారు. కొంతకాలంగా మట్టి, చెత్త పేరుకుపోవడంతో దిగువ ప్రాంత రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించిన సర్పంచ్ చిలివేరి జ్యోతి, జేసీబీ సహాయంతో కాలువను శుభ్రం చేయించి నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేశారు.