ASF: కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి శనివారం పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వార్డులోనూ ప్రతిరోజూ పరిశుభ్రత పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు.