WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో 2,689 నల్ల పైపులు, రూ. 2 లక్షల విలువైన నల్ల పైపుల దొంగతనానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 9వ తేదీన పోలీస్ స్టేషన్లో మిషన్ భగీరథ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తి వివరాలు మాత్రం రాకపోవడంతో నల్ల పైపుల దొంగలు ఎవరని వర్ధన్నపేట మండలంలో చర్చనీయాంశంగా మారింది.