MLG: ఈనెల 14 నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO సిధార్ధరెడ్డి చెప్పారు. 102 పాఠశాలల నుంచి 3290 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, వీరిలో 1696 మంది బాలురు, 1594 బాలికలు ఉన్నారన్నారు. 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసామని, నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు.