SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 22న విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రియాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఉదయం 11 గంటలకు సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.