SDPT: వేసవిలో గ్రామస్థులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మగ్ధూంపూర్ సర్పంచ్ పాకాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం జరిగిన గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని సమృద్ధిగా సరఫరా చేస్తామన్నారు. అలాగే, గ్రామంలోని ప్రతి వీధి దీపం వెలిగేలా చూడాలని, చెడిపోయిన వాటికి తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు.